విజయవాడ ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం.. అమ్మవారికి పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించారు. ఈ క్రమంలో.. సీఎంకు ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించారు.
Read Also: Jangaon: పండగ ఎఫెక్ట్.. దసరా ముందు 30 మేకలను ఎత్తుకెళ్లిన దొంగలు..
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుకు కొండచరియలు విరిగిపడినవి, వాటిని బాగుచేసినవి ఫోటోలు అధికారులు చూపించారు.
Read Also: Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!