Site icon NTV Telugu

అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది…

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అని కామెంట్ చేసారు. ఎంతో మంది ఆర్థిక సలహాదారులు గా ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయమైన స్థితిలో ఉండడం దారుణం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి 4068 కోట్లు కు సంబంధించి కొర్రీలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 6 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 7 శాతం చొప్పున 42 వేల కోట్లు ప్రతీ ఏడాది వడ్డీ చెల్లించాలి అని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Exit mobile version