Site icon NTV Telugu

ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

YV Subba Reddy

YV Subba Reddy

తిరుమల : 25 వ తేది నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేశారు. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారి చేస్తున్న టోకెన్లు నిలిపివేస్తూన్నామని ప్రకటించారు. 24 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ మాసం కు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version