తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై కనకవర్గం, కాసుల వర్షం కురుస్తూనే ఉంది.. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటడం ఇది వరుసగా 10వ నెల కావడం విశేషం.. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. ఈ నెలలో ఐదు సార్లు ఏకంగా 5 కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండి ఆదాయం… ఈ నెల 27వ తేదీన శ్రీవారికి రోండో అత్యధిక ఆదాయంగా 5.88 కోట్ల రూపాయలు లభ్యం అయ్యాయి.. కరోనా ఆంక్షల సడలింపు తర్వాత వరుసగా భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది.. ఇదే సమయంలో.. హుండీ ఆదాయం కూడా పెరిగిపోయింది.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతీ నెల 100 కోట్ల మార్క్ ని దాటేస్తోంది శ్రీవారి హుండీ ఆదాయం.. ఆగస్టు నెలలో అత్యధికంగా శ్రీవారికి హుండి ద్వారా రూ.140.34 కోట్ల రూపాయల ఆదాయం లభ్యం అయ్యింది.. ఇక, ఇదే ఏడాది జూలై 4వ తేదీన శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు.. మొత్తంగా వరుసగా 10వ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 మార్క్ను దాటడం విశేషంగా చెప్పుకోవాలి.. ఈ నెల ఇప్పటికే రూ.120.3 కోట్ల ఆదాయం రాగా.. ఈ నెల ముగింపునకు అది ఎంత వరకు చేరుతుందో చూడాలి.
Read Also: Nedurumalli Ramkumar Reddy: ఎమ్మెల్యే ఆనంపై నేదురుమల్లి కౌంటర్ ఎటాక్.. పవన్ ఆ మాట ఎందుకన్నాడు..?
