ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,944 శాంపిల్స్ పరీక్షించగా.. 415 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 584 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,25,840 కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 2064287 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 2045276 కు చేరుకుంది.. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14356 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4655 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
ఏపీ కరోనా : నేడు పెరిగిన కేసులు…
