ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత బులెటిన్‌ కంటే.. ఇవాళ కాస్త తక్కువ వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,848 శాంపిల్స్‌ పరీక్షించగా.. 385 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 675 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,95,18,787 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,66,450 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,47,722 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,373 కు చేరిందని.. ప్రస్తుతం 4,355 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.