ఏపీలో ఈరోజు కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,731 శాంపిల్స్ పరీక్షించగా.. 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ బాధితులు ఒక్కరు ఈరోజు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 214 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,16,261 కి చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,198 కి పెరిగింది.. ఇక, 20,55,603 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,432 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2163 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో స్థిరంగా కరోనా కేసులు…

corona