ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ప్రతీ రోజూ 100కి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,595 శాంపిల్స్ పరీక్షించగా.. 184 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 183 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,04,46,677 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,093 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 20,56,501 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,443 కు చేరిందని.. ప్రస్తుతం 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ కరోనా : నేడు స్థిరంగా కేసులు
