Site icon NTV Telugu

ఏపీలో నేడు తగ్గిన కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 29,263 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 159 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 169 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,75,940 కు చేరింది.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73,252 కు పెరగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,56,670 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,138 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,444 కు పెరిగింది.

Exit mobile version