ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,641 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,546 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 15 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,968 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 2,47,08,540కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,410 మంది ప్రాణాలు వదలగా.. 19,36,016 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
ఏపీలో నేడు తగ్గిన కరోనా కేసులు…
corona