ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 67,716 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,501 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 10 మంది మృతిచెందారు. మరోవైపు.. 24 గంటల్లో 1,697 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,98,603 కు చేరుగా.. ఇప్పటి వరకు 13,696 మంది మృతి చెందారు.. రికవరీ కేసులు 19,69,169 కు పెరగగా.. ప్రస్తుతం 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీ కరోనా : పెరుగుతున్న కేసులు
ap corona