Site icon NTV Telugu

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు…

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,363 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 1,288 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,24,603కు.. రికవరీ కేసులు 19,96,143కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 13,950 గా ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,510 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల సంఖ్య 2,70,99,014 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Exit mobile version