Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల

  • తిరుమలలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు
  • ఒకే రోజు ఏడు వాహనాల సేవ
  • భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు
  • అర్ధ బ్రహ్మోత్సవం ప్రత్యేకత
Ttd

Ttd

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక రథసప్తమి వేడుకలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ఈ ఉత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఒకే రోజులో స్వామి వారు ఏడు వేర్వేరు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత, అందుకే దీనిని ‘అర్ధ బ్రహ్మోత్సవం’ అని కూడా పిలుస్తారు.

ఈ ఉత్సవం ఉదయం సూర్యోదయ వేళ సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై, ఆపై వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామి వారు భక్తులకు కటాక్షిస్తారు. చివరగా రాత్రికి జరిగే చంద్రప్రభ వాహన సేవతో ఈ రథసప్తమి సంబరాలు ముగుస్తాయి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడిని ఒకే రోజు ఇన్ని రూపాల్లో దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు , అన్నప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.

 T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే.. ఆ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది?