తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రేపు సమావేశం కానుంది… 2022-23 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది… మొత్తంగా 49 అంశాలుతో కూడిన అజెండాను పాలక మండలి సమావేశం కోసం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు… టేబుల్ ఐటెంగా మరి కొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఊరట
అజెండాలోని అంశాల విషయానికి వస్తే..
*2022-23 వార్షిక బడ్జెట్ను ఆమోదించనుంది టీటీడీ పాలకమండలి
- 3,171 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ 2022-23 వార్షిక బడ్జెట్
- 1000 కోట్లు హుండీ ద్వారా ఆదాయం అభిస్తుందని అంచనా
- రూ.230 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం
- గరుడా వారధికి 25 కోట్ల రూపాయల కేటాయింపు
- టీటీడీ అమలులోకి రానున్న నూతన పీఆర్సీ విధానం
- ప్రభుత్వం జారి చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ క్రింద రూ. 50 కోట్లు చెల్లింపు
- చిన్నపిల్లల ఆస్పత్రికి విరాళాల కోసం నూతనంగా అపన్న హృదయ స్కీం ప్రారంభం
- శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్దికి రూ. 3.9 కోట్లు కేటాయింపు
- తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములును వెనక్కి తీసుకోనున్న టీటీడీ
- కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లు పెంపుపై నిర్ణయం..
- ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ