సిల్క్ డెవలప్మెంట్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది కోర్ట్. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2015 జూన్ లోనే కుంభకోణానికి శ్రీకారం చుట్టినట్లు తేల్చిన రిమాండ్ రిపోర్ట్… జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ లకు దురుద్దేశ పూర్వకంగా సీమెన్స్ ప్రాజెక్టు సొమ్ము 241 కోట్లను ప్రభుత్వ భాగస్వామ్యంగా ఇచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఈ 241 కోట్లను పలు షెల్ కంపెనీలకు బదలాయించినట్టు గుర్తించిన సీఐడీ… ఏడు షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. 241 కోట్లను పివిఎస్పి, స్కిల్లర్, డిజైన్ టెక్ కంపెనీ లకు తప్పుడు విధానంలో బదలాయించి… రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించినట్లు గుర్తించింది సీఐడి.
అయితే ప్రాజెక్టు వ్యయం ప్రభుత్వానికి, టెక్నాలజీ కంపెనీలకు మధ్య విభజించడంలో మోసాలు జరిగినట్లు గుర్తించిన సీఐడి… స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ప్రారంభించకుండానే.. డిజైన్ టెక్ అకౌంట్ లో 371 కోట్లు డిపాజిట్ చేసినట్లు.. అలాగే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లలో 241 కోట్లు గోల్ మాల్ జరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ప్రభుత్వం 10%, డిజీ టెక్ 90% ఇవ్వవలసి ఉండగా.. డిజి టెక్ 90% ఇవ్వకముందే ప్రభుత్వ వాటా రిలీజ్ చేసినట్టు గుర్తించిన సీఐడీ… 2017లో డీజీజీఐ డిజైన్ టెక్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
అయితే సుమన్ బోస్ గా సంతకం చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్… ఏపీ, గుజరాత్ అగ్రిమెంట్లలో సంతకాల మధ్య వ్యత్యాసం గుర్తించింది సీఐడీ. అగ్రిమెంట్ల పై సీమెన్స్ పరిశోధన ప్రారంభమైన వెంటనే రాజీనామా చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్… సీమెన్స్ ఎండీ, వికాస్ కన్విల్కర్ ల మధ్య కరెన్సీ నోట్ల నంబర్లను టోకెన్ నంబర్లుగా పంపుకున్నట్టు గుర్తించిన సీఐడీ… ముఖ్యమైన ఫైళ్ళు, పత్రాలు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచీ తొలగించినట్టు గుర్తించింది. అయితే ఈ కేసులో ప్రాధమిక ఆధారాల మేరకు ఐపీసీ సెక్షన్లు 120(B), 166, 167, 418, 420, 475, 468, 471, 409, 201, 109 r/w 34,37 కింద కేసు నమోదు చేసారు.