NTV Telugu Site icon

ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది:సూర్యనారాయణ


ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఉద్యోగులు దాచు కున్న సొమ్ము ఏడాదికి రూ. 8 నుంచి రూ. 10 కోట్ల మేర ఉంటుం దని, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడుతుందన్నారు. ప్రత్యేక అకౌంట్‌ పెట్టి ఉద్యోగులకు జీపీఎఫ్‌ డబ్బులు పెండింగ్‌లో పెట్టకుండా ఇచ్చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

జీపీఎప్‌ ఖాతాలకు జమ చేసిన డీఏ ఏరియర్స్‌ సొమ్మును ఉద్యోగు లకు చెప్పకుండానే వారి వ్యక్తిగత ఖాతాల నుంచి వెనక్కు తీసుకుం టున్నారన్నారు. ఉద్యోగుల ప్రమేయం లేకుండా.. వారి వ్యక్తిగత ఖాతా ల నుంచి జమ అయిన సొమ్మును ఎలా వెనక్కు తీసుకుంటా రని సూర్యనారాయణ ప్రశ్నించారు. జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి డబ్బును వెనక్కు తీసుకున్న ఘటనపై విచారణ జరిపించాలన్నారు. సీఎఫ్‌ ఎంఎస్‌, ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల న్నారు. జీపీఎఫ్‌ ఖాతాల్లోని మా డబ్బుకు భద్రత ఉందా అనే అను మానం కలుగుతోందన్నారు. ఉద్యోగుల సమస్యలు పై ప్రభుత్వం స్పందన సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక భారం లేని అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదని, సీపీఎస్ రద్దు, డీఏల చెల్లింపు, పీఆర్సీ అమలు చేస్తామన్న హామీలు పట్టించు కోవడం లేదని సూర్యనారాయణ విమర్శించారు.