ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి కొడాలి నాని హామీతో వెనక్కు తగ్గారు రేషన్ డీలర్లు.. నవంబర్ కోటా రేషన్కు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా.. జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు.. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు..
Read Also : బీజేపీకి మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్.. దమ్ముంటే ఆ పనిచేయండి..
ఇక, రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు బుధవారం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతే నిరసన కార్యక్రమాలు కొనసాగించారు డీలర్లు.. ఓవైపు రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదన్న మంత్రి కొడాలి నాని.. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని.. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. మరోవైపు.. వారికి హామీ ఇచ్చారు.. దీంతో.. రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయ్యింది.