Site icon NTV Telugu

అలర్ట్‌ : మరో మూడు రోజుల పాటు వర్షాలు

ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం నుండి ఒక తూర్పు పడమర ద్రోణి.. ఉత్తర అరేబియా సముద్రం నుండి దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ మీదుగా & ఉత్తర మహారాష్ట్ర మరియు తెలంగాణ మీదుగా 3.1 కి.మీ & 4.5 కి.మీ.ల మధ్య ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 21 న వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.


15° N లాట్ వద్ద సగటు సముద్ర మట్టం నుండి సుమారు 3.1 కిమీ మరియు 5.8 కిమీ మధ్య గల తూర్పు పశ్చిమ షీర్ జోన్ దక్షిణ దిశ కు వంగి… ఇప్పుడు బలహీన పడింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర & పరిసరాలపై ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల వరకు విస్తరించి…ఇప్పుడు బల హీన పడింది వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Exit mobile version