ఇది చర్చలా లేదు.. చిట్ చాట్లా ఉంది : సూర్యనారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సీఎస్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదక ఆమోద యోగ్యంగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ బయటకు వచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు జరుగుతున్న తీరుపై అసంతృప్తితో బయటకు వచ్చేసినట్లు ఆయన తెలిపారు.
చర్చల్లో అసలు విషయం కాకుండా అక్కర్లేని ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ బండి, బొప్పరాజులపై సూర్యనారాయణ మండిపడ్డారు. చర్చల తరహాలో కాకుండా చిట్ చాట్ తరహాలో సమావేశం జరుగుతోందని సూర్యనారాయణ అన్నారు. తన వంతు సమయం వచ్చినప్పుడు చర్చకు వస్తానని ప్రకటించి సమావేశం నుంచి బయటకొచ్చేసినట్లు సూర్యనారాయణ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. సూర్యనారాయణ లోపలకి వెళ్లే సమయం కోసం బుగ్గన పేషీ వద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేచిఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!