Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Jagan Visits Juvvaladinne Fishing Harbour In Nellore Promises Support To Fishermen

YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!

Published Date :April 15, 2026 , 12:30 pm
By Sudhakar Ravula
YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: నెల్లూరు జిల్లా పర్యటనలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుని, తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు.

Read Also: TDP New Committees: టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రకటన… నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు..

సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో ఈ పనులను ప్రారంభించామని, మరో రూ.6 వేల కోట్లతో విస్తరణ పనులు పూర్తి చేయాలని సంకల్పించామని చెప్పారు. పోర్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక అనుమతులు కూడా పూర్తయ్యాయని వివరించారు. రామాయపట్నం పోర్టు 95 శాతం పనులు పూర్తయ్యాయని, శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టులో 35 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు కూడా వేగంగా సాగాయని చెప్పారు జగన్.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను 2024 మార్చిలో వర్చువల్‌గా ప్రారంభించామని, అన్ని పనులు పూర్తయినా ఇప్పటివరకు ఉపయోగంలోకి తేవలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

మత్స్యకారులకు 1250 మెకనైజ్డ్ బోట్లు అందించాలని నిర్ణయించామని, ఒక్కో బోటుకు 12 మంది మత్స్యకారులు యజమానులు అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ బోట్లు ఇప్పటికీ మత్స్యకారులకు అందేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల గురించి ఆలోచించడంలేదని జగన్ ఆరోపించారు. తమిళనాడు నుంచి వచ్చిన బోట్లు ఇక్కడ వేట చేస్తున్నాయని, స్థానిక మత్స్యకారుల సంపదను తరలించుకుంటున్నారని అన్నారు. వాటిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా, ప్రభావశీలుల జోక్యంతో విడిపించారని విమర్శించారు. జువ్వలదిన్నె ప్రాంతంలో ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీ కోసం భూములు కేటాయిస్తున్నారని, ఇది మత్స్యకారులకు అన్యాయం అని జగన్ అన్నారు. అవసరమైతే కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో భూములు ఇవ్వవచ్చని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తేనని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మళ్లీ వస్తే హార్బర్ పరిధిలోని మత్స్యకారులను మ్యాపింగ్ చేసి బోట్లు అందిస్తామని, ఈ ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిగా వారికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మత్స్యకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చివరగా, “దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లుమూసుకుని తెరిచేలోపు మన ప్రభుత్వం వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • Andhra Pradesh fishing harbour news
  • fishermen welfare Andhra Pradesh
  • Jagan fishermen promises
  • Jagan Juvvaladinne Fishing Harbour

తాజావార్తలు

  • YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!

  • Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..

  • Munaf Patel: విరాట్, రోహిత్‌కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..

  • Agadha: ఆకట్టుకుంటున్న ‘అగధ’ పోస్టర్..

  • TDP New Committees: టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రకటన… నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions