YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: నెల్లూరు జిల్లా పర్యటనలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుని, తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో ఈ పనులను ప్రారంభించామని, మరో రూ.6 వేల కోట్లతో విస్తరణ పనులు పూర్తి చేయాలని సంకల్పించామని చెప్పారు. పోర్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక అనుమతులు కూడా పూర్తయ్యాయని వివరించారు. రామాయపట్నం పోర్టు 95 శాతం పనులు పూర్తయ్యాయని, శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టులో 35 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు కూడా వేగంగా సాగాయని చెప్పారు జగన్.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 2024 మార్చిలో వర్చువల్గా ప్రారంభించామని, అన్ని పనులు పూర్తయినా ఇప్పటివరకు ఉపయోగంలోకి తేవలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
మత్స్యకారులకు 1250 మెకనైజ్డ్ బోట్లు అందించాలని నిర్ణయించామని, ఒక్కో బోటుకు 12 మంది మత్స్యకారులు యజమానులు అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ బోట్లు ఇప్పటికీ మత్స్యకారులకు అందేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల గురించి ఆలోచించడంలేదని జగన్ ఆరోపించారు. తమిళనాడు నుంచి వచ్చిన బోట్లు ఇక్కడ వేట చేస్తున్నాయని, స్థానిక మత్స్యకారుల సంపదను తరలించుకుంటున్నారని అన్నారు. వాటిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా, ప్రభావశీలుల జోక్యంతో విడిపించారని విమర్శించారు. జువ్వలదిన్నె ప్రాంతంలో ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీ కోసం భూములు కేటాయిస్తున్నారని, ఇది మత్స్యకారులకు అన్యాయం అని జగన్ అన్నారు. అవసరమైతే కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో భూములు ఇవ్వవచ్చని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తేనని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మళ్లీ వస్తే హార్బర్ పరిధిలోని మత్స్యకారులను మ్యాపింగ్ చేసి బోట్లు అందిస్తామని, ఈ ఫిషింగ్ హార్బర్ను పూర్తిగా వారికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మత్స్యకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చివరగా, “దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లుమూసుకుని తెరిచేలోపు మన ప్రభుత్వం వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!