సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్యకేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సత్యంబాబు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి నాలుగేళ్లైనా న్యాయం జరగలేదని సత్యంబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆయేషా మీరా కేసును సీబీఐ ఇంకా విచారిస్తోందని, ఎప్పుడు విచారణ ముగిస్తుందో తెలియదన్నాడు సత్యం బాబు. ఆయేషా మీరా తల్లికి, తనకు న్యాయం చేయాలని సీజేఐకి సత్యంబాబు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ ఎలా స్పందిస్తారో చూడాలి.