శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు.
Read Also: Tirumala: మందకొడిగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల బుకింగ్
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆ సమయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిలిపివేసి తర్వాత మళ్లీ పునరుద్ధరిస్తారు. కరోనా కారణంగా జనవరి 19 నుంచి గర్భాలయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలను అధికారులు నిలిపివేశారు. తిరిగి రేపటి నుంచి ప్రారంభించనున్నారు.
