Sai Priya Missing Case: కొత్త కోణం.. విశాఖకు సాయిప్రియ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Priya And Ravi In Vizag Police Custody: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద కనిపించకుండా పోయిన సాయిప్రియ వ్యవహార తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! బీచ్లో కొట్టుకుపోయిందేమోనన్న అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు చేపడితే, సాయిప్రియ మాత్రం అందరికీ ట్విస్ట్ ఇస్తూ ప్రియుడు రవితో బెంగుళూరుకి వెళ్లింది. అక్కడ అతడ్ని వివాహం చేసుకొని, తనని వెతకొద్దని మెసేజ్ చేసింది. ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బెంగుళూరులో సాయిప్రియ దంపతుల లొకేషన్ కనుగొన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని, విశాఖకు తరలించారు. అక్కడి నుంచి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
కాగా.. సాయిప్రియ (21)కు భీమవరం ప్రాంతానికి చెందిన శిరుగుడి శ్రీనివాసరావుకు 2020 జూలై 25వ తేదీన పెళ్లి జరిగింది. హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తోన్న శ్రీనివాసరావు.. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న పెళ్లిరోజు కావడంతో.. రెండురోజుల ముందే భార్యాభర్తలు సాయిప్రియ ఇంటికొచ్చారు. కాసేపు సరదాగా గడపడం కోసం, అదే రోజు సాయంత్రం ఆర్కే బీచ్కి వెళ్లారు. ఇద్దరు కలిసి నీళ్లలోకి దిగారు. ఇంతలో శ్రీనివాసరావుకి మెసేజ్ రావడంతో ఒడ్డుకు వచ్చాడు. అంతే.. నీళ్లలో ఉన్న సాయిప్రియ, అట్నుంచి అటే మాయమైపోయింది. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందేమోనన్న అనుమానంతో భర్త శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించాడు. సీసీటీవీ కెమెరాల్లో ఆమె జాడ కనిపించలేదు.
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ఇంతలో మీడియాలో సాయిప్రియ సముద్రంలో గల్లంతయ్యిందన్న వార్తలు రావడంతో.. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. హెలీకాప్టర్లు, కోస్ట్గార్డ్ షిప్లు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రప్పించారు. కట్ చేస్తే.. సముద్రంలో మునిగిన సాయిప్రియ బెంగుళూరులో కనిపించింది. తన ప్రియుడు రవిని పెళ్లాడింది. చివరికి వారి ఆచూకీ తెలుసుకొని, విశాఖకు తీసుకొచ్చారు. శ్రీనివాసరావుకు, సాయిప్రియకు పెళ్లై రెండేళ్లయినా.. ఇంకా సంతానం కలగలేదని, దీనిపై వారిద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!