కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్పన్ ఆర్కె రోజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని తెలిసి చాలా బాధపడ్డాను. షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వియ్ విల్ మిస్ యూ అంటూ రోజా ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి నటించిన సీన్స్ కి సంబంధించిన వీడియో ట్వీట్ చేశారు రోజా.
వియ్ విల్ మిస్ యూ పునీత్.. రోజా ట్వీట్
