ఆనందయ్య కరోనా మందుపై ఇవాళ తుది నివేదిక వచ్చే అవకాశం ఉందని శుక్రవారం ప్రకటించారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు నాయక్.. అయితే, వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నివేదికకు మరో రోండు రోజుల సమయం పట్టే అవకాశంఉంది.. ఇవాళ, రేపు కేంద్ర సంస్థలకు సెలవు కావడంతో నివేదిక సోమవారమే అంటున్నారు నిపుణులు.. అత్యవసరంగా భావిస్తే తప్ప ఇవాళ నివేదిక రావడం అనుమానమే అంటున్నారు.. మరో వైపు హైకోర్టులో అనుమతులు వస్తేనే ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశం ఉంది.. తన మందుని పంపిణి చేసేలా ఉత్తర్వులు ఇవాల్సిందిగా హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. దీనిపై కూడా సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాలని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు… ఆనందయ్య మందు పంపిణి సందర్భంగా భౌతిక దూరం పాటించడం లేదన్న కారణంతోనే మందు పంపిణిని అడ్డుకున్నారు అధికారులు..
ఇక, ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనమే అని చెబుతున్నారు కొందరు అధికారులు.. సీసీఆర్ఏఎస్ కి సానుకూల నివేదిక పంపిందట విజయవాడ పరిశోధన కేంద్రం… విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్ రాలేదంటు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. ప్రభుత్వం ద్వారానే మందు పంపిణీ చేసే యోచనలో సర్కార్ ఉంది.. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నారని.. ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది.