Site icon NTV Telugu

Markapuram Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం..

Markapuram Bus Accident

Markapuram Bus Accident

Markapuram Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది సజీవదహనం అయినట్టుగా సమాచారం.. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీ వద్ద ప్రైవేట్ హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ విషాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Read Also: Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

ఈ ప్రమాదంలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం.. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికుల వరకు ఉన్నట్టుగా తెలుస్తుండగా.. 10 మంది ఇప్పటికే సజీవదహనం అయినట్టుగా భావిస్తున్నారు.. ఇక, ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైనవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. అయితే, ఇందులో ఎవరి పరిస్థితి ఎలా ఉంది..? అని పూర్తి సమాచారం అందుతుండగా.. ప్రమాద తీవ్రతను చూస్తే మాత్రం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.. ఈ బస్సు జగిత్యాల నుంచి కనిగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకొన్న వెంటనే మంటలు ఎలా చెలరేగాయి అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Exit mobile version