Site icon NTV Telugu

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామి

సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు.

పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్ షా లు తయారవుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని దింపి తీరుతామని, జగన్ కు జైళ్లలో వేయడం ఆనవాయితీగా ఉందని ఆయన అన్నారు. జైల్ భరో చేసి జైళ్లను నింపుదామన్నారు. హిందువులు అందరిని కేసులు పెట్టి లోపల వేసినా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version