Site icon NTV Telugu

కర్నూలు కలెక్టర్ కు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు…

కర్నూలు కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమిషన్. ఈ నెల 13న జాతీయ బీసీ కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేసాడు 2వ వార్డు బీజేపీ అభ్యర్థి గణేష్. తనను పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటికి గెంటేశారని ఫిర్యాదు చేసాడు. గతంలో 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించగా… ఇప్పటికే నివేదిక సమర్పించారు కర్నూలు ఎస్పీ.

Exit mobile version