MVR: అనకాపల్లి రేసులోకి ఎంవీఆర్..? ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో చాలా మంది రాజకీయ నేతలు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు. ప్రజాసేవ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తామని పార్టీ అధినేతలకు చెప్తుంటారు. ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వర రావు (ఎంవీఆర్) ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ పలు పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరాయి. కానీ ఎంవీఆర్ అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన రాకను స్వాగతించాయి. పార్టీల్లో చేరాలని ఆహ్వానం పలికాయి. అయితే గెలిచే పార్టీలోనే చేరాలనే ఉద్దేశంతో ఎంవీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారు. ఒకవేళ రాజకీయ సమీకరణాలతో ఆయనకు టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ముత్యాల వెంకటేశ్వర రావు అలియాస్ ఎంవీఆర్ కాపు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త. వ్యాపారవేత్తగా ఆయన నియోజకవర్గంలో ఎంతోకాలంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరధిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఆ తర్వాత యాదవులదే ఆధిపత్యం. అందుకే ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలు బరిలో ఉండేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎంవీఆర్ ను పోటీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలను కూడా గెలిపించుకోగల సత్తా ఉందని చెప్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన వ్యాపారాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉండడం ఎంవీఆర్ కు కలిసొచ్చే అంశం. ఉత్తరాంధ్ర నిరుద్యోగులు ఎంతోమందికి ఆయన సొంతంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించారు. వ్యాపారవేత్తగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎంవీఆర్ కు మంచి పలుకుబడి ఉంది. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, కేరళలో కూడా ఎంవీఆర్ కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.
Also Read
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
ఎంవీఆర్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఆపరేషన్లకు సాయం చేయడం లాంటివి నిత్యం ఆయన చేపడుతుంటారు. ఎంవీఆర్ కు భక్తి ఎక్కువ. అందుకే ఆరు నెలలపాటు ఆయన దీక్షలోనే ఉంటారు. ఏడాది పొడవునా దైవిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆలయాలను పునరుద్ధరించడం, కల్యాణాలు నిర్వహించడం ఆయనకు ఇష్టమైన పనులు. ఇలా అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న ఎంవీఆర్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!