NTV Telugu Site icon

MLA Gudiwada Amarnath: ఒంటరిగా జగన్ ని ఢీకొట్టగలరా?

టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్.

41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి చేతిలో రాయి వుంటే ఎలా వుంటుందో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలా వుంది. శవ రాజకీయాలు చేసి తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు . జన్మ ఇచ్చిన తల్లిని రాజకీయాలకు వాడుకుంటున్నావ్… నీకు సిగ్గు వుందా? నువ్వు బయటికి వచ్చిన ప్రతిసారి తల్లిని రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. లోకేష్ ఎన్టీఆర్ కి వారసుడు కాదు…ఎన్టీఆర్ ని చంపిన వ్యక్తికి వారసుడు మాత్రమే అన్నారు. ఖర్జూర నాయుడు పేరు ఎత్తని లోకేష్ కు జగన్మోహనరెడ్డి పై మాట్లాడే స్థాయి నీకు లేదన్నారు.

జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి రక్తపు మరకలపై నీ తండ్రి రాజకీయ ఎదుగుదల జరిగిందన్నారు. ఎన్టీఆర్, మాధవరెడ్డి, హరికృష్ణ, లాల్ జాన్ బాషా, యర్రం నాయుడు, బాలయోగి మరణాలు పై విచారణ చేయాలనీ మాకు అనిపిస్తోంది. అయ్యన్న పాత్రుడు నిత్య తాగుబోతు అయ్యన్న. వేస్ట్ మై సన్ ఎవరో రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. ధైర్యం వుంటే ఒంటరిగా పోటీ చేస్తామని టీడీపీ చెప్పాలని సవాల్ చేస్తున్నా అన్నారు. ఒంటరిగా పోటీచేసే సత్తా టీడీపీకి వుందా అన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.