Seediri Appalaraju: సీఎం జగన్ను దూషిస్తున్నారు.. ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలోనే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదగకూడదన్నది చంద్రబాబు బలమైన అకాంక్షగా పేర్కొన్న ఆయన.. టీడీపీకి ఎమ్మెల్సీ , రాజ్యసభ అవకాశం వస్తే సూటికేస్ ఇచ్చేవారికి కేటాయించారు… బీసీలకు ఆదరణ తీసుకువచ్చామంటారు.. మీరు ఇచ్చిన ఆదరణ పథకంతో బాగుపడ్డ ఒక్క కుటుంబాన్ని చూపించండి అంటూ సవాల్ విసిరారు.. పదవులు అమ్ముకోవడం చంద్రబాబు నైజం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ స్థాయి ఏంటి? జగన్ స్థాయి ఏంటి? పిల్లబచ్చా లోకేష్ ది.. సీఎం జగన్ ను విమర్శించే స్థాయి కాదని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Volodymyr Zelenskyy: చైనా ఆ పని చేస్తే ‘వరల్డ్ వార్’ తప్పదు.. జెలెన్స్కీ హెచ్చరిక
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
సీఎం వైఎస్ జగన్ను వ్యక్తి గతంగా తిడుతూ దూషిస్తున్నారు.. కానీ, ఒక్కొక్కడికి తాటతీసే రోజు దగ్గరలో ఉందంటూ హెచ్చరించారు అప్పలరాజు.. మేం కన్నెర్ర చెస్తే గ్రామాలలో తిరగలేరు అని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, గన్నవరంలో ఇష్యూని రాజకీయంగా మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తారు అని ఆరోపించారు.. టీడీపీ హద్దు మీరే ప్రయత్నం చేస్తుంది.. చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోవాలని సూచించారు. ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసినా.. గన్నవరం లాంటి ఘటనలు తీసుకొచ్చినా ఏమీ చేయలేరన్నారు.. నీ దరిద్రం ఇక రాష్ర్టానికి చాలు అని చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఇక, వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 44 మంది ఎమ్మెల్సీ లు మంత్రి అర్హత కలిగినవారే.. మంత్రి వర్గకూర్పు అంశం సీఎం విచక్షణ అధికారమని స్పష్టం చేశారు.. కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. నేను మొదటిగా రిజైన్చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మా మత్స్యకారులకు మంచి గౌరవం ఇచ్చారు.. మత్స్యకారులకు జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన గౌరవం ఎవరు ఇవ్వలేదని.. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇచ్చారు.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ అనే కంటే వైఎస్సాఆర్ బహుజన పార్టీ అనాలంటూ అభివర్ణించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!