Site icon NTV Telugu

Minister Narayana: మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ కీలక భేటీ..

Amaravati

Amaravati

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాల‌యంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయ‌ణ‌, సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ కన్నబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా- ఆంధ్రా బిజినెస్ చాంబ‌ర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల పురోగ‌తిని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత ఈ మీటింగ్ కొనసాగుతుంది. అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి నారాయణ పలు అంశాలను వివ‌రించారు.

Read Also: Auto Driver Seva: రేపు ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!

అయితే, రెండున్నరేళ్లలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు మలేషియా ప్రతినిధులకు మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయ‌క‌త్వంలో ప్రపంచంలోని టాప్ 5 రాజ‌ధానుల్లో అమ‌రావ‌తిని ఒక‌టిగా రూపుదిద్దుతామ‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిన మ‌లేషియాకు చెందిన ప‌లు ప్రైవేట్ సంస్థలు.. రాబోయే ఐదేళ్లలో 6000 నుంచి 10,000 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేలా ప‌లు ప్రాజెక్టుల‌ను మంత్రి నారాయ‌ణ‌కు వివరించిన మ‌లేషియా బృందం.

Exit mobile version