Bhagavanth khuba : ఏపీ లో బిజేపి పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీకి బాగా ఆదరణ పెరగటానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలే కారణమని కేంద్ర, ఎరువులు మరియు రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వ్యాఖ్యానించారు.బెజవాడ పర్యటన లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డబ్బు పంపిణీతో ప్రాంతీయ పార్టీల ఓటు చీలిందని కర్ణాటక రాజకీయలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ తగ్గలేదని, కానీ ఇతర పార్టీల ఓటు కాంగ్రెస్ కి వెళ్లిందని అని అన్నారు. 2024 ఎన్నికలలో కర్నాటక లో మెజారిటీ ఎంపీ స్థానాలు మేము సాధిస్తామని, తమిళనాడు, కేరళలో బిజెపి బలోపేతం అవుతోందని ఆయన అన్నారు.. తెలంగాణలో అధికారం కచ్చితంగా చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, జనసేన, బిజెపి పొత్తుతో ఏపీలో కలిసి పని చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఎవరైనా ఏదైనా చెబితే అది వారి సొంత అభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.పురోగతి లేక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని కూడా తెలిపారు. పార్టీ విధానంలో మేమంతా కూడా కలిసి పని చేస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే వాదనలో వాస్తవం లేదని కూడా కొట్టి పారేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కేంద్రం కోరుకుంటుందని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని,పోలవరం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించారు. చేసిన పనులకు బిల్లులు పూర్తి గా అయితే ఇవ్వలేదన్నారు. మోడీ తొమ్మిదేళ్లలో పూర్తి పారదర్శకమైన పాలన ను అందిస్తున్నారని, మోడీ మంచి పాలన అందిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. 2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ హవాతో విజయం సాధిస్తామని,దేశ ఆర్ధికాభివృద్ధి ఎంతో పెరిగిందని కూడా చెప్పారు
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!