NTV Telugu Site icon

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ…

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన 5 పిటిషన్ల పై విచారణ జరపనుంది కోర్టు. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన 11 మరణాలు , అనంత ఆసుపత్రిలో 12 మరణాలపై సుమోటో కేసులుగా స్వీకరించి విచారణ చేయనుంది. అంతేకాకుండా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల, ఎండి గోపాల కృష్ణ బెయిల్ పిటిషన్ల పై విచారణ చేయనుంది హైకోర్టు. చూడాలి మరి ఈ కేసులో ఏ విధమైన తీర్పులను కోర్టు ఇస్తుంది అనేది.