Site icon NTV Telugu

Kadapa : రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు

Rain

Rain

కడప జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. గురువారం జిల్లావ్యాప్తంగా వీచిన ఈదురు గాలులు, వడగండ్ల వాన రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామ పరిసరాల్లో జోరు వానతో కూడిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కోతకు సిద్ధంగా ఉన్న అరటి, మొక్కజొన్న, , సజ్జ పంటలు ఈ గాలివాన ధాటికి తట్టుకోలేక పూర్తిగా నేలమట్టమయ్యాయి. చేతికి వస్తుందనుకున్న పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకున్న తరుణంలో ప్రకృతి ప్రకోపానికి గురయ్యామని, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన పరిహారం అందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!

Exit mobile version