Site icon NTV Telugu

నరసాపురం పర్యటనకు సిద్ధమైన జనసేనాని

అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్… ఇప్పటికే గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు.. ఇక, ఈ మధ్యే విశాఖలో పర్యటించిన జనసేనాని.. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. అయితే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ నెల 21న నరసాపురంలో పర్యటించనున్నారు.. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక, పార్టీ అధినేత పర్యటనను దృష్టిలో ఉంచుకుని.. బహిరంగసభ విజయవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి జనసేన పార్టీ శ్రేణులు.

Exit mobile version