Site icon NTV Telugu

ఇండిగో కీలక నిర్ణయం… కడప నుంచి విజయవాడ, చెన్నైకి విమానాలు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్‌ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు.

Read Also: ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ చెన్నై-కడప, విజయవాడ-కడప మార్గాల్లో నడపనుంది. అంతేకాకుండా కర్నూలు నుంచి విజయవాడకు మార్చి 27 నుంచి విమాన సర్వీసును నడుపుతామని గతంలోనే ఇండిగో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version