Site icon NTV Telugu

ఢిల్లీ నుండి విశాఖకు అక్రమ మద్యం…

ఏపీలో అక్రమ మద్యం గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ నుండి విశాఖకు భారీగా మద్యం బాటిళ్ళు తెచ్చి అమ్ముతున్నాడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతల గౌరీ శంకర్. విశాఖ నుండి విమానంలో ఢిల్లికి వెళ్లి అక్కడ నుండి మద్యంతో తిరిగి రైళ్ళులో చేస్తాడు. సిఐఎస్ఎఫ్ చెందిన ట్రంక్ పెట్టిలో మద్యం రవాణ చేస్తున్నాడు. ఢిల్లీ నుండి ఇక్కడికి మద్యం తెచ్చి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసారు ఎక్సైజ్ పోలీసులు. న్యూ ఢిల్లీ వెళ్లి రమేష్ అనే వ్యక్తి దగ్గర మద్యం కోనుగోలు చేస్తున్నాడు. ఇక్కడ డిపార్ట్మెంట్ సరుకు అని చెప్పి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. గతంలో కూడా పలుమార్లు మద్యం తరలించాడు నిందితుడు. అనకపల్లి లోని పోలీసుల తనిఖీల్లో కానిస్టేబుల్ వ్యవహరం బయటపడ్డింది. ప్రస్తుతం పోలీస్ ల అదుపులో నిందితుడు ఉన్నాడు. అతని దగ్గర నుండి 75 వేలు విలువ చేసే 143 కాస్ట్ లీ బాటిళ్లు ద్వాదినం చేసుకున్నారు పోలీసులు.

Exit mobile version