NTV Telugu Site icon

పేద విద్యార్థులకు తానా లాప్‌టాప్స్ పంపిణీ…

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటుగా విద్యారంగం పై కూడా ఎక్కువగా పడింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి అన్ని విద్య సంస్థలు. కానీ చాలామంది పేద పిల్లల వద్ద ఆన్లైన్ తరగతులు వినడానికి ఫోన్స్, లాప్‌టాప్స్ వంటిని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులకు తానా చేయూతను అందిస్తూ… నేడు ఏపీలోని గుంటూరు కమ్మ హాస్టల్ లో ఉంటున్న 32 మంది విద్యార్థులకు లాప్‌టాప్స్ పంపిణీ చేసింది. దాంతో ఈ కరోనా సమయంలో తమకు సహాయం చేసిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని మరియు ట్రస్టీ రామ్ చౌదరి, రాజేశ్వరీ అలాగే మిగిత నిర్వాహకులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.