NTV Telugu Site icon

సీసీ కెమెరాల గజదొంగ అరెస్ట్

ఏపీలోని వివిధ జిల్లాల వ్యాప్తంగా 23 చోరీ కేసులు చేసిన గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెదగొన్నూరులో నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ప్రధానంగా సీసీ కెమెరాలు, వైఫై రౌటర్లు, డీవీఆర్ లు చోరీ చేసేవాడని తెలిపారు. అంతేకాదు చోరీల్లో సుబ్రహ్మణ్యం చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలకు వెళ్లేవాడని వివరించారు.
సీసీ కెమెరాల దొంగతనం బోర్ కొట్టిందో లేక పెద్ద దొంగతనంతో సెట్ అయ్యిపోవాలి అనుకున్నాడో ఏమోగాని, గుంటూరు అర్బన్ పరిధిలోని ఆటోనగర్ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలో ఫిబ్రవరి 8న షట్టర్ పగులగొట్టి రూ.2.40 లక్షలు చోరీ చేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.4 లక్షలు నగదు, చోరీ చేసిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.