Guntur Fake Notes: నకిలీ నోట్ల కలకలం.. జనం ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో నకిలీ నోట్లు బయటపడుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లకు తేడా తెలియకపోవడంతో జనం మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకోసం నకిలీ కరెన్సీ చలామణి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి మార్కెట్లోకి చలామణిలోకి తెస్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో రెండుసార్లు నకిలీ నోట్లు బయపడ్డాయి. ఈపూరు మండలం ఎర్రబాలెంలో పొలానికి వెళ్తున్న రైతుకు రోడ్డుపై కరెన్సీ దొరికింది.
అయితే నోట్లను పరిశీలించిన రైతుకు అనుమానం వచ్చింది. దీంతో నగదును పోలీసులకు అప్పగించారు. నోట్లను పరిశీలించిన పోలీసులు నకిలీవిగా తేల్చారు. 87నకిలీ వందరూపాయల నోట్లుగా గుర్తించారు. నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు వచ్చి పోలీసుల భయంతో రోడ్డుపై పడేసి వెళ్లినట్లు అనుమానం. తాజాగా వినుకొండలో పెట్రోల్ కోసం బంక్ కు యువకుడు వచ్చాడు. ఐదువందల నోటు ఇచ్చిన యువకుడికి బాయ్ 200రూపాయల నోటు తిరిగి ఇచ్చాడు. ఈ నోటును చూసిన యువకుడికి అనుమానం వచ్చింది. తీరా పరిశీలిస్తే రెండు వందల రూపాయల నోటు నకిలీదిగా తేలింది. దీంతో యువకుడు ఖంగు తిన్నాడు.
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మాచర్లలో ఓ షాపులో నకిలీ నోట్లతో కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో యజమాని గుర్తించాడు. వెంటనే నకిలీ నోట్లుగా చెప్పడంతో తనకు ఎవరో ఇచ్చారని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇక దాచేపల్లి, రాజుపాలెం, పేరేచెర్ల ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఘటనలు బయటకొచ్చాయి. ప్రధానంగా వంద, రెండు వందలు, ఐదువందల రూపాయల నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ పై అవగాహన ఉంటే చాలు ప్రింటర్ సాయంతో నోట్లు ప్రింటింగ్ చేసి ఈజీగా మార్కెట్లో చలామణి చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో నకిలీనోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డ వారిలో గుంటూరు జిల్లాకు చెందినవారు కూడా ఉన్నారు. ఒరిజినల్ నోట్లు పదివేలు ఇస్తే నకిలీ నోట్లు ముప్పైవేలు ఇస్తామంటూ అమాయకులను టార్గెట్ చేసి ఈ ఊబిలోకి దించుతున్నారు. పెద్దమొత్తంలో నకిలీ నోట్లు చలామణి చేస్తే ఇబ్బందులు కలుగుతాయని చిన్న మొత్తాల్లోనే చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు బయటకొచ్చినా అవి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకపోవడంతో నకిలీల దందా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఫేక్ దందాకు అడ్డుకట్ట వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!