Subramanyam Murder Case: డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..

Mlc

Mlc

Subramanyam Murder Case: దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఇవాళ్టి నుంచి రోజువారీగా నిర్వహించనున్నారు. న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో డే-టు-డే ట్రయల్ ప్రారంభం కానుంది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో వేగం పెరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు.. విచారణ జాప్యం అవుతోందన్న అంశంపై సమీక్షించిన హైకోర్టు, కేసును రోజువారీగా విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు సూచనల మేరకు రాజమహేంద్రవరంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయగా, ఇవాళ్టి నుంచి ఇక్కడే డే-టు-డే విచారణ జరగనుంది. ఈ క్రమంలో సాక్ష్యుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియను ప్రత్యేక కోర్టు చేపట్టనుంది. విచారణకు సంబంధించి పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుల తరపు న్యాయవాదులకు న్యాయస్థానం ఇప్పటికే సమాచారం అందించింది. కేసు విచారణ వేగవంతం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయం త్వరగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన వీధి సుబ్రమణ్యం హత్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభం కావడం కీలక పరిణామంగా మారింది. ప్రత్యేక కోర్టు విచారణతో కేసు త్వరితగతిన తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది..