NTV Telugu Site icon

శివాలయంలో అపశ్రుతి… క్రేన్ నుంచి జారిపడిన ధ్వజస్తంభం

కృష్ణా జిల్లాలోని ఓ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని మల్లపల్లి గ్రామంలోని ఓ ఆలయంలో బుధవారం నాడు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు శివాలయంలో క్రేన్ సహాయంతో ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో… క్రేన్ నుంచి ధ్వజస్తంభం జారి కింద పడింది.

Also Read: వైరల్… హద్దులు దాటిన ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ

అయితే చాలా ఎత్తున ధ్వజస్తంభం ఒక్కసారిగా క్రేన్ నుంచి జారిపడటంతో ముక్కలు ముక్కలైంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.