Site icon NTV Telugu

వైసీపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ నేత పురంధేశ్వరి

ఏపీలో 13 జిల్లాలను విభజిస్తూ కొత్తగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాను రెండు భాగాలుగా విభజించి విజయవాడ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటివరకు టీడీపీ నేత‌లు, నంద‌మూరి వారసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ స్పందించలేదు.

Read Also: కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథచక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు

అయితే తాజాగా ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి మాత్రం ఈ అంశంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు గారు పుట్టిన జిల్లాకు ‘ఎన్టీఆర్‌ జిల్లా’ అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని అభిప్రాయపడ్డారు. ‘జై ఎన్టీఆర్’ అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version