CPI Narayana: నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది..?
- ప్రధాని మోడీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం..
- నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాం..
- బస్తర్ అడవిలోని విలువైన ఖనిజాలను పెత్తందార్లకు ఇచ్చేందుకు కేంద్రం కుట్ర..
- నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది?: సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు.. ప్రధాని మోడీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. బస్తర్ అడవులను ఖాళీ చేయించి విలువైన ఖనిజాలు పెత్తందార్లకు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వానికి తేడా ఏముంది అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలి అని డిమాండ్ చేశారు. లేదంటే, బంగ్లాదేశ్ లో ఎంపికైన ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొట్టారు.. శ్రీలంక, నేపాల్ లో కూడా ఇలాగే జరిగింది.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వమే నేపాల్ తిరుగుబాటుకు ప్రధాన కారణం అని సీపీఐ నారాయణ వెల్లడించారు.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ఇక, 75 ఏళ్లు దాటిన వాళ్లు పార్టీలో ఉండొచ్చు.. నాయకత్వంలో ఉండకూడదు అని నారాయణ చెప్పుకొచ్చారు. సీపీఐలో కూడా దీనిపై ఛండీఘడ్ లో జరిగే సదస్సులో చర్చిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో కూడా 75 ఏళ్లు దాటితే నాయకత్వం వదులుకోవాలనే దానిపై చర్చ జరుగుతుంది.. బహుశా రెండు మూడు నెలల్లో అది జరుగుతుందేమో అన్నారు. 2029 ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమం చేపడుతుంది. అలాగే, మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదు.. డబ్బులు లేవంటూనే అమరావతి నిర్మాణం చేస్తున్నారు కదా.. అలాగే, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!