Site icon NTV Telugu

రేపు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించ‌నున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు.

https://ntvtelugu.com/genome-sequencing-tests-in-gandhi-hospital-from-today/

అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 1 గంటల‌కు తణుకు నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Exit mobile version