Site icon NTV Telugu

ఏపీలో భారీ వర్షాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని… 2 బృందాలు ఇప్పటికే నెల్లూరు చేరుకున్నాయన్నారు. 2 బృందాలు చిత్తూరు చేరుకున్నాయని… కర్నూలులో మరో 2 బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని…సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలన్నారు. వారికి మంచి ఆహారం అందించడమే కాకుండా…. బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించాలని ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని… బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్.

Exit mobile version