Site icon NTV Telugu

సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: చంద్రబాబు

సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తోపాటు సాయితేజ దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.. చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో తెలిపారు.

సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతడి కృషి ఎంతో దాగుందని నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. గిరిజన కుటుంబంలో జన్మించిన సాయి తేజ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version