NTV Telugu Site icon

తూర్పుగోదావ‌రి జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగ‌స్ కేసులు…

దేశంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  రోజువారీ పాజిటీవ్ కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య సైతం ఆంధోళ‌న క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసుల‌తో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ కేసులు కూడా భ‌య‌పెడుతున్నాయి.  దేశంలో ఇప్ప‌టికే ఈ కేసులు 12 వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ బ్లాక్ ఫంగ‌స్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.  తూర్పు గోదావ‌రి జిల్లాలో ఇప్ప‌టికే ఈ కేసులు 50 కి చేరాయి.  బాదితులు కాకినాడలోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.  క‌రోనా చికిత్స స‌మ‌యంలో కొలుకోవ‌డానికి అధిక‌మొత్తంలో మెడిసిన్ వాడ‌టం వ‌ల‌న బ్లాక్ ఫంగ‌స్ ఎటాక్ అవుతుంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.