అప్పుల మీద అప్పులతో జనంపై భారం… పురంధేశ్వరి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు సమాధి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటగిరి పట్టణంలో పర్యటించి స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్ పాలనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకి నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు, మూల విరాట్టులను సైతం ధ్వంసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తోందన్నారు పురంధేశ్వరి.
Also Read
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి 2లక్షల50 వేల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడది 6లక్షల కోట్లు దాటిందంటే ఎంతటి ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు పెట్టే పరిస్థితులే లేవన్నారు. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా విధ్వంసాలు, విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ పాలన సాగుతోందన్నారు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!